చిన్నజీయర్ స్వామిజీకి సీఎం కేసీఆర్ దిమ్మతిరిగే షాక్..!

-

త్రిదండి చిన్న జీయర్ స్వామి కి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరోసారి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి సైతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు. సీఎం కేసీఆర్ మీ కార్యక్రమానికి రప్పించేందుకు చిన్న జీయర్ స్వామితో పాటు మై హోమ్ సంస్థల అధినేత రామేశ్వరరావు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

మరోవైపు ముగింపు రోజు జరగాల్సిన శాంతి కల్యాణాన్ని ఈ నెల 19వ తారీకుకు వాయిదా వేసినట్లు చిన్న జీయర్ స్వామి ప్రకటన చేశారు. ఈ వాయిదా సీఎం కేసీఆర్ కోసమే ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన… సీఎం కేసీఆర్, చిన్న జీయర్ స్వామి ల మధ్య చిచ్చు రేపినట్లూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

రామానుజ సహస్రాబ్ది వేడుకలు జరుగుతున్న తీరు తో పాటు వేడుకలు నిర్వహిస్తున్న చిన్న జీయర్ స్వామి అలాగే మై హోమ్ అధినేత రామేశ్వరరావు పై సీఎం కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని పర్యటన తో పాటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చింతల్ పర్యటన కు కూడా దూరంగా ఉన్న సీఎం కేసీఆర్… ముగింపు వేడుకలకు సైతం రాకపోవడాన్ని బట్టి ఆయన ఇంకా ఆగ్రహంతోనే ఉన్నట్లు అర్థమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news