175 కోట్ల సైబర్ క్రైమ్ కేసులో ఇద్దరు అరెస్ట్..!

-

పాతబస్తీ 175 కోట్ల సైబర్ క్రైమ్ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేసారు పోలీసులు. షంషీర్ గంజ్ SBI బ్యాంక్ మేనేజర్ తో పాటు జిమ్ ట్రైనర్ ను అరెస్ట్ చేసారు. అయితే పాతబస్తీ బ్యాంక్ లో 175 కోట్ల రూపాయలు కొట్టేసిన కేసులో ఇప్పటికే ఇద్దరు ఆటో డ్రైవర్స్ ను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 6 నకిలీ అకౌంట్ల ద్వారా 175 కోట్ల నగదు లావా దేవీలు జరిపారు నిందితులు. షంషీర్ గంజ్ బ్రాంచ్ మేనేజర్ బాబు గాలి, ఉపాధ్యాయ సందీప్ శర్మలు అరెస్ట్ అయ్యారు.

నిందితులు మొత్తం 175 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. మోసగాళ్లతో కుమ్మక్కై బ్యాంక్ లో కరెంట్ ఖాతాలను తెరచి డబ్బులను డ్రా చేసారు. ఆ డబ్బును సైబర్ నేరగాళ్ల అకౌంట్లలోకి మళ్లించి కమీషన్లు తీసుకున్నట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు. ఇక అరెస్ట్ చేసిన ఇద్దరిని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version