హుజూర్ నగర్ నుంచి నేను, కోదాడ నుంచి పద్మావతి పోటీ – ఉత్తమ్

-

హుజూర్ నగర్ నుంచి నేను, కోదాడ నుంచి పద్మావతి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు కాంగ్రెస్‌ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి. పార్టీ మార్పు వార్తలపై స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి..తాను పోటీ చేయబోయే స్థానాలను ప్రకటించేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున హుజూర్ నగర్ నుండి తాను, కోదాడ తన పద్మావతి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.

నేను కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నట్లు మీడియాలో/సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, ఎలాంటి ఆధారం లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవిలో ఉన్న ఓ నాయకుడు పార్టీలో నా స్థానాన్ని దిగజార్చేందుకు, ప్రజల్లో నా ప్రతిష్టను దిగజార్చేందుకు ఇలాంటి దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version