కర్ణాటకలో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాం – కేఏ పాల్

-

కర్ణాటకలో బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించామని అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. రెండేళ్లుగా ప్రజాశాంతి పార్టీ కర్ణాటకలో కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చిందని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గా లేదని.. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేందుకు ప్రజాశాంతి పార్టీ ఏ విధంగా మద్దతు ఇచ్చిందో.. అదేవిధంగా తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ గెలిచేందుకు కాంగ్రెస్ మద్దతు పలకాలని కోరారు.

హుజురాబాద్ లో మూడు లక్షల ఓట్లు పడితే వన్ పర్సెంట్ ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదన్నారు కేఏ పాల్. కాబట్టి కాంగ్రెస్ నాయకులు మల్లు రవి, భట్టి విక్రమార్క, హనుమంతరావు లను తెలంగాణలో ఓట్లు చీల్చవద్దని పదేపదే అడిగామన్నారు. బిజెపి, బీఆర్ఎస్ పార్టీలను ఓడించడానికి చిత్తశుద్ధితో కాంగ్రెస్ పని చేయాలన్నారు. తెలుగు రాష్ట్రాలను రక్షించుకుందాం అని అన్నారు కేఏ పాల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version