కొనసాగుతున్న ఎమ్మెల్సీ కౌంటింగ్.. ఎన్ని ఓట్లు వస్తే ఎవరు గెలుస్తారంటే..?

-

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ మూడో రోజు కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 16 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. వారి ఎలిమినేషన్ తో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కు 120 ఓట్లు లభించాయి. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కు 67 ఓట్లు లభించగా.. ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కు 24 ఓట్లు పొందారు.

ఈసారి గతంలో కంటే అత్యధికంగా 25,824 చెల్లని ఓట్లు నమోదు అయ్యాయి. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగా.. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గెలుపు కోటా ఓట్లు 1,55,095 గా నిర్ణయించారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపునకు కావాల్సిన రెండో ప్రాధాన్యత ఓట్లు 32,282 కాగా, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపునకు కావాల్సిన రెండో ప్రాధాన్యత ఓట్లు 50,847గా తేల్చారు. రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవ్వరికీ లభిస్తే.. వారినే విజయం వరించనుంది. మొత్తానికి తీన్మార్ మల్లన్న లేక రాకేష్ రెడ్డి అనేది రెండో ప్రాధాన్యత ఓట్ల పైనే ఫలితం వెలువడనుంది. 2021 మార్చి లో కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version