మునిగిన కార్గో షిప్‌.. 8 మంది మృతి

-

జపాన్‌, దక్షిణ కొరియా మధ్య సముద్రంలో ఒక భారీ కార్గొషిప్ మునిగిపోయింది. ఈ ప్రమాద సమయంలో నౌకలో ఉన్న 22 మంది సిబ్బందిలో 8 మంది మరణించారు. వీరిలో ఆరుగురు చైనా జాతీయులు. ఈ షిప్ హాంకాంగ్ కు చెందిన కంపెనీది. హాంకాంగ్‌ కంపెనీకి చెందిన 6,551 టన్నుల బరువున్న జిన్ టియాన్‌ రవాణా నౌక డిసెంబర్ 3న మలేషియాలోని పోర్ట్ క్లాంగ్ నుంచి బయల్దేరింది. కలప లోడ్ తో వెళ్తున్న ఈ షిప్ జపాన్ లోని నాగసాకికి నైరుతి దిశలో 160 కిలోమీటర్ల దూరంలో మునిగిపోయింది.

జపాన్‌, దక్షిణ కొరియా మధ్య మునిగిన కార్గో షిప్‌.. 8 మంది మృతి

షిప్ మునిగిపోయిన విషయాన్ని తెలుసుకున్న జపాన్, దక్షిణ కొరియా కోస్ట్ గార్డ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ను చేపట్టారు. ఆరుగురు చైనీయులతో సహా 8 మంది సిబ్బంది మరణించగా మిగతా 9 మంది గల్లంతైనట్లు తెలుస్తున్నది. కలప లోడ్‌తో దక్షిణ కొరియాలోని ఇంచియాన్ పోర్ట్‌కు వెళ్తున్నది. అయితే బుధవారం తెల్లవారుజామున జపాన్‌లోని నాగసాకికి నైరుతి దిశలో 160 కిలోమీటర్ల దూరంలో ఈ కార్గో షిప్‌ మునిగిపోయింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news