అయ్యా బాబోయ్..పట్ట పగలే దొంగతనమా..

-

దొంగలు అంటే చీకటి లో మాత్రమే కర్ణాలు వేస్తారు..అందుకే రాత్రుళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటారు.కానీ అది ఒకప్పటి మాట..ఇప్పుడు ట్రెండ్ మారింది.దొంగలు కూడా షిఫ్ట్ మార్చుకున్నారు.పట్ట పగలే అందరు చూస్తుండగా దొంగతనం చేస్తే మంచి కిక్ ఉంటుందని ఇప్పుడు అందరు అలానే ఫాలో అవుతున్నారు. అందుకు సంభందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. అందరూ చూస్తున్నా కూడా ఎవరూ దానిని అడ్డుకోలేదు.ఆ వీడియో ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది..

వీడియో పాతదే అయినప్పటికీ, ఫన్నీగా ఉన్న ఆ వీడియోపై నెటిజన్లు రకరకాలు కామెంట్స్ చేస్తూ మరోమారు ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. అందులో ఓ ఆటో ట్రాలీ నిండా సామానుతో వెళ్తోంది. ఆ ఆటో ట్రాలీ వెనకాలే, ఓ యువకుడు వేలాడుతూ కనిపిస్తుంటాడు..ఆ ట్రాలీలో ఉన్న వస్తువులను అతడు మెల్లిగా చోరీ చేస్తూ…తన వెనకాలే బైక్‌పై వస్తున్న మరో వ్యక్తికి అందిస్తున్నాడు. ఇదంతా జరుగుతున్నప్పటికీ చుట్టు పక్కల వాహనదారులు, ప్రయాణికులు ఎవరూ పట్టించుకున్న పాపనాపోలేదు.

ఎవరి పనిలో వారు ఉంటున్నారు.మాకెందుకు వచ్చిన గోల అని పట్టనట్లే ముందుకు వెళ్తున్నారు. వెనుక నుంచి కారులో వస్తున్న ఓ వ్యక్తి ఇదంతా వీడియో తీశాడు.ఆ తర్వాత సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయటంతో అది కాస్త ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు..దొంగల దైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.. ఇలా చేస్తే వాళ్ళు కూడా బిజినెస్ పెట్టవచ్చు..అంటున్నారు.. మీరు ఒకపారి చూసి లైక్ , కామెంట్ వేసుకోండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version