ఈ అసెంబ్లీ సమావేశాలే కేసీఆర్ కు చివరివి – బండి సంజయ్

-

తమ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పెట్టుకున్నారని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గ్రామపంచాయతీ నిధులను సీఎం కేసీఆర్ దారి మళ్లించారని.. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ కి చివరివని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం గురించి కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదని ఆరోపించారు. గ్రామ పంచాయతీల డబ్బులను కాజేశారని మండిపడ్డారు బండి సంజయ్. ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ము ని ప్రయత్నించిన వ్యక్తి కెసిఆర్ అని ఆరోపించారు. తెలంగాణలో బిజెపికి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు బండి సంజయ్. బిజెపి అధికారంలోకి వచ్చాక పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందించడంతోపాటు పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version