చంద్ర‌బాబును జ‌గ‌న్ చంపాల‌ని చూస్తున్నారు.. ఎమ్మెల్సీ సంచ‌ల‌న కామెంట్లు

-

ఏపీ రాజ‌కీయాలు కుత‌కుత ఉడుకుతున్నాయి. వ‌రుస‌గా టీడీపీ నేత‌ల‌పై కేసులు న‌మోద‌వ‌డం ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. మొన్న‌టికి మొన్న లోకేశ్‌పై క్రిమినల్ కేసు, అలాగే చంద్ర‌బాబుపై కేసులు పెట్ట‌డం ఒక్క‌సారిగా దుమారం రేపింది. వీటికి మ‌రింత ఆజ్యం పోస్తూ టీడీపీ ఎమ్మెల్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

టీడీపీ అధినేత చంద్ర‌బాబును హ‌త్య చేయాల‌ని సీఎం జ‌గ‌న్ కుట్ర ప‌న్నుతున్నారంటూ క‌డ‌ప టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ ర‌వి చేసిన కామెంట్లు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. ఈరోజు ఆయ‌న జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. అరెస్టుల పేరుతో చంద్ర‌బాబును ఆస్ప‌త్రుల చుట్టూ తిప్పి క‌రోనాతో చంపేయాల‌ని జ‌గ‌న్ స్కెచ్ వేశాడ‌ని మండిప‌డ్డారు.

ఇప్పుడు క‌రోనా వ‌స్తే వైసీపీ నేత‌ల‌కే బెడ్లు ఇస్తున్నార‌ని, టీడీపీ వాళ్ల‌కు ఇవ్వ‌ట్లేద‌ని ఆరోపించారు. చంద్ర‌బాబుకు క‌రోనా వ‌చ్చినా బెడ్ ఇవ్వ‌రేమో అన్నారు. జ‌గ‌న్ కుట్ర‌ల‌కు గాను ఆయ‌న‌పై క్రిమిన‌ల్ కేసులు పెట్టాల‌ని డిమాండ్ చేశారు. ఎన్ని కేసులు పెట్టినా భ‌య‌ప‌డేది లేద‌ని తేల్చి చెప్పారు. కాగా ఈయ‌న కామెంట్లు ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాయి. మ‌రి దీనిపై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version