రేపు రాహుల్ గాంధీ పాదయాత్రకు విరామం

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు రేపు విరామం ప్రకటించారు. నేటితో పాదయాత్ర ప్రారంభమై 15 రోజులపాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది. ఇప్పటివరకు 15 రోజుల పాదయాత్రలో 333 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. నేటి పాదయాత్రలో అండమాన్, లక్షద్వీప్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రేపు ( శుక్రవారం) పాదయాత్రకు విరామం ప్రకటించగా.. తిరిగి శనివారం భారత్ జోడో పాదయాత్ర ప్రారంభం కానుంది.

విద్యార్థులు, యువకులు, మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలతో ముచ్చటిస్తూ.. ముందుకు వెళ్తున్నారు రాహుల్. పాదయాత్రలో పలువురు కార్మికులను సైతం కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం కేరళలో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది. కేరళలో ఆయన ఏడు జిల్లాల మీదుగా 450 కిలోమీటర్లలో 19 రోజులపాటు పాదయాత్ర సాగిస్తారు. అక్టోబర్ 1న కర్ణాటకలోకి యాత్ర ప్రవేశిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news