BREAKING : తీన్మార్ మల్లన్న పై టిఆర్ఎస్ దాడి !

-

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు పై నిన్న తీన్మార్ మల్లన్న సంచలన నిర్వహించిన సంగతి తెలిసిందే. హిమాన్షు ను అవమానిస్తూ పోల్ నిర్వహించాడు తీన్మార్ మల్లన్న. అయితే ట్విట్టర్ లో పెట్టిన ఆ పోల్… టిఆర్ఎస్ నేతలకు కోపం తెప్పించింది. కోపంతో ఊగిపోయిన టిఆర్ఎస్ సానుభూతిపరులు తీన్మార్ మల్లన్న పై అర్ధరాత్రి దాడి చేశారు.

ఈ ఘటన బోడుప్పల్ పరిధిలోని లక్ష్మీ నగర్ కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు.. బోడుప్పల్ లోని తెలంగాణ పత్రిక కార్యాలయంలో ఉన్న తీన్మార్ మల్లన్న వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగి ఆయనపై దాడి చేశారని సమాచారం. అయితే దీనిపై తీన్మార్ మల్లన్న టీం సభ్యుడు రాజ్ కుమార్ మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని మేడిపల్లి ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి కూడా మీడియాకు వెల్లడించారు. అయితే.. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news