బీజేపీ వ్యతిరేఖ పార్టీలకు టీఆర్ఎస్ డబ్బులు… కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

టీఆర్ఎస్ ప్లీనరిలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు అబద్దాలు, అభూత కల్పనలు మాట్లాడారని… పూనకం వచ్చినట్లు వ్యవహరించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ అంటే కేసీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణకు ఏం చేశావో చెప్పాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు. యూపీఏ హాయాంలో మంత్రిగా పనిచేసిన నువ్వు తెలంగాణకు ఏం తెచ్చావని ప్రశ్నించారు. కనీసం ఆఫీసుకు కానీ.. క్యాబినెట్ మీటింగ్ కానీ వెళ్లలేదని విమర్శించారు. గుణాత్మక పాలన అంటే కల్వకుంట్ల పాలనా..? తండ్రి, కొడుకుల పాలనా..? అని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన బీజేపీ వ్యతిరేఖ పార్టీలకు టీఆర్ఎస్ డబ్బులు పంపిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి. జాతీయ రాజకీయాల కోెసం గతంలో విమానాన్ని అద్దెకు తీసుకుని.. అసదుద్దీన్ ఓవైసీతో కలిసి తిరుగుతా అని అనుకున్నారని..గోవాలో 1800 మందిని రంగంలోకి దించి టీఎంసీకి అనుకూలంగా పనిచేశారని విమర్శలు చేశారు. కేసీఆర్ ఫ్రంట్ పెట్టుకోవచ్చు, టెంట్ వేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. నదుల అనుసంధానం అంటే ఇల్లు ఎక్కి కేసీఆర్ లొల్లి పెడుతున్నాడు…వృధా అవుతున్న నీటిని అరికట్టాలంటే నదుల అనుసoదానము తోనే సాధ్యమని..నదుల అనుసంధానం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news