హైదరాబాద్: టీపీసీసీకి కొత్త కెప్టెన్ వచ్చారు. దాంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నయా జోష్ కనిపిస్తోంది. రేవంత్ దూకుడుతో కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. ఘాటు విమర్శలతో ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. అటు ఆందోళనలతో పార్టీని ఉరుకుటు, పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఆధారాలతో ఎండగడుతున్నారు. అందరి ఫోకస్ను తనవైపుకు తిప్పుకుంటున్నారు. బీజేపీ వైపు చూసిన తటస్తులు, ప్రభుత్వ వ్యతిరేకులు .. కాంగ్రెస్ వైపు ఆకర్షితులను చేస్తున్నారు. దీంతో నిన్నా మొన్నటి వరకు పొలిటికల్ స్క్రీన్ మీద దూసుకుపోయిన బీజేపీని వెనక్కి నెట్టి కాంగ్రెస్ను గేమ్లోకి తెచ్చారు. రేవంత్ ఎంట్రీ తర్వా త పొలిటికల్ సీన్ను టీ ఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మార్చుకుననారు. దీంతో టీపీసీసీ కొత్త టీంపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు.
టిఆర్ఎస్ ప్రయోగించిన అంగబలం, అర్థబలాన్ని ఎదుర్కొని మల్కాజిగిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత తన పార్లమెంట్ పరిధిలో పార్టీ బలోపేతం కోసం రేవంత్ గట్టిగా పని చేస్తూ వచ్చారు. స్థానిక సంస్థల్లో మల్కాజి గిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ కొంత మెరుగైన ఫలితాలే సాధించింది.ఐతే ఇప్పుడు రేవంత్ పీసీసీ చీఫ్ అవ్వడంతో ఆయన నియోజక వర్గంలో ఆపరేషన్ ఆకర్ష్ ను గులాబీ పార్టీ సవాల్గా తీసుకుంది. పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత రేవంత్ నియోజక వర్గ పరిధిలోని.. నలుగురు కార్పొరేటర్లు, నలుగురు కౌన్సిలర్లు.. మరో నలుగురు ఎంపిటిసిలను టీఆర్ఎస్లోకి లాగేసుకున్నారు. గత అసెం బ్లీ ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డి ప్రచార కమిటీ చైర్మన్గా రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేస్తే..కొడంగల్లో స్థానిక నేతలను లాగేసి రేవంత్ను ఓడించారు. అయితే ఇప్పుడు ఎన్నికలు లేకపోయినప్పటికీ ఆపరేష న్ ఆకర్ష్తో ఆత్మస్తైర్యం దెబ్బతీయొచ్చని.. అసెంబ్లీ ఎన్నికల నాటి ఫార్ములానే టీఆర్ఎస్ అప్లై చేస్తున్నారు.
మరోవైపు అధికార పార్టీకి రివర్స్ లో షాకిచ్చే వ్యూహాలకు రేవంత్ పదును పెట్టారు. టీఆర్ఎస్లో అసంతృప్తులు, ఉద్యమకారులను హస్తంపార్టీలోకి తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.