తలసరి విద్యుత్ వినియోగం, జీరో ఫ్లోరైడ్ రాష్ట్రంగా తెలంగాణ నెంబర్ వన్ : సీఎం కేసీఆర్

-

తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల కన్నా తలసరి ఆదాయంలో తెలంగాణ ముందుంది అని… 2 లక్షల 78 వేలతో తలసరి ఆదాయంతో ముందు వరసలో తెలంగాణ ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో, ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చిన రాష్ట్రంగా, జీరో ఫ్లోరైడ్ రాష్ట్రంగా తెలంగాణ దేశంలో నెంబర్ వన్ గా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. మనం పండించే పంటను కేంద్రం కొనలేని స్థితికి తెలంగాణ చేరిందని ఆయన అన్నారు. తెలంగాణ జీఎస్డీపీ దేశం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉందని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఒకప్పుడు 3 వైద్యకళాశాలలు ఉంటే ప్రస్తుతం 33 ప్రభుత్వ వైద్యశాలలను ఏర్పాటు చేసుకోబోతున్నాం అని ఆయన అన్నారు. సుమారు 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రంగా తెలంగాణ దేశంలో టాప్ లో ఉందని ఆయన అన్నారు. తెలంగాణ పని చేసిన స్థాయిలో దేశం పనిచేసినట్లయితే గొప్పస్థానంలో ఉండేదని.. టీఆర్ఎస్ పనిచేసిన స్థాయిలో కేంద్రంలోని బీజేపీ పనిచేసుంటే 14.5 లక్షల కోట్లు జీఎస్డీపీ ఉండే అవకాశం ఉండేదని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news