కాంగ్రెస్‌తో కారు… రేవంత్‌కు చిక్కులు!

-

తెలంగాణలో ఎదుగుతున్న బీజేపీని నిలువరించేందుకు టీఆర్ఎస్ నానా కష్టాలు పడుతుంది. ఊహించని విధంగా బలపడి..అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న బీజేపీకి చెక్ పెట్టడానికి టీఆర్ఎస్ అనేక దారులు వెతుక్కుంటుంది. ఎలాగో తమపై వచ్చిన వ్యతిరేకతని కేంద్రంపై యుద్ధం చేసి పోగొట్టుకోవాలని చూస్తుంది…ఇప్పటికే కేసీఆర్ ఆ దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో కేసీఆర్…జాతీయ స్థాయిలో ఉన్న విపక్షాలకు దగ్గరయ్యే కార్యక్రమాలు చేస్తున్నారు…బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల మద్ధతు పొందేందుకు చూస్తున్నారు.

ఇదే క్రమంలో తెలంగాణలో తమకు ప్రత్యర్ధిగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో సైతం కేసీఆర్ సన్నిహితంగా మెలుగుతున్నట్లు కనిపిస్తోంది. ఓ వైపు రాష్ట్రంలో కాంగ్రెస్..కేసీఆర్ సర్కార్ లక్ష్యంగా విమర్శలు చేస్తుంది…ఎలాగైనా కేసీఆర్ ని గద్దె దించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ చూస్తుంది. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో వైరుధ్యం ఉన్నా సరే..జాతీయ స్థాయిలో మాత్రం కాంగ్రెస్ తో కలిసి ముందుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. బలమైన బీజేపీని ఎదుర్కోవాలంటే…మిగిలిన విపక్షాల సపోర్ట్ తో పాటు…జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ మద్ధతు కూడా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిపి నిరసన కార్యక్రమాల్లో టీఆర్ఎస్ ఎంపీలు పాల్గొంటున్నారు. ఇప్పటికే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్ధతుగా నిలిచిన విషయం తెలిసిందే…ఇక సిన్హాకు కాంగ్రెస్ సపోర్ట్ ఉంది. అలాగే తాజాగా కేంద్రం అమలు చేసిన జీఎస్టీ విషయంలో పార్లమెంట్ దగ్గర విపక్షాలు ధర్నాకు దిగాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో టి‌ఆర్ఎస్ ఎంపీలు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ పక్కనే టీఆర్ఎస్ ఎంపీలు నిలబడ్డారు.

ఇలా టీఆర్ఎస్..కాంగ్రెస్ తో క్లోజ్ గానే ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ అంశం రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ పై పోరాటం చేస్తున్న టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారింది. కేసీఆర్ జిమ్మిక్కులు వల్ల కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసే ఉన్నాయనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని రేవంత్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. మొత్తానికి కేసీఆర్ ఎత్తులే వేరు.

Read more RELATED
Recommended to you

Latest news