విద్యార్థులకు శుభవార్త.. రేపే ఫలితాలు..

-

తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. ఇంటర్‌ ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఫలి‌తా‌లను ఈ నెల 28న ఉదయం 11 గంట‌లకు విడు‌దల చేస్తా‌మని విద్యా‌శాఖ మంత్రి పీ సబితా ఇంద్రా‌రెడ్డి తెలి‌పారు. ఫలి‌తా‌లను https://tsbienew.cgg.gov.in/, https://results. cgg.gov.in, https://examresults.ts.nic.in లో చూడా‌లని ఆమె సూచించారు. మొత్తం 9,07,393 మంది విద్యా‌ర్థులు ఇంటర్‌ పరీ‌క్ష‌లకు హాజ‌ర‌య్యా‌రని ఆమె వెల్లడించారు.

అందులో 4,42,767 మంది సెకం‌డి‌యర్‌ విద్యా‌ర్థులు, 4,64,626 మంది ఫస్టి‌యర్‌ విద్యా‌ర్థులు ఉన్నా‌రని పేర్కొన్నారు. వీరంతా ఈ ఏడాది మే 6 నుంచి 24 వరకు రాష్ట్రవ్యా‌ప్తంగా 1,443 కేంద్రాల్లో పరీ‌క్షలు రాశా‌రని చెప్పారు. విద్యా‌ర్థులు ఒత్తి‌డికి గురైనా, ఇతర సమ‌స్యల పరి‌ష్కా‌రా‌నికి టోల్‌ఫ్రీ నం.18005999333ను సంప్రదించ‌వ‌చ్చని మంత్రి తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version