TSPSC పేపర్ లీక్: “ప్రవీణ్ – రాజేశ్వర్” … లింక్ ఏమిటో తెలుసా ?

-

TSPSC పేపర్ లీక్ లో తాజాగా కొత్త విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం లో కల్లా ఇది చాలా కీలకమని తెలుస్తోంది. గ్రూప్ 1 AE పేపర్ లీక్ లో ప్రధాన పాత్ర రాజేశ్వర్ దిగా బయటకు వచ్చింది. మొత్తం 3 పేపర్ లను ఒక్కో పేపర్ రూ. 40 లక్షలకు అమ్మినట్లు విచారణలో తెలిసింది. దీని కోసం ముందుగా రూ. 25 లక్షలు అడ్వాన్స్ గా తీసుకుని ఒప్పందం కుదుర్చుకున్నారట, కమిట్మెంట్ ద్వారా బ్యాలన్స్ డబ్బును ఈ ఫలితాలు వచ్చిన తర్వాత ఇచ్చేలా మాట్లాడుకున్నారు.

అయితే ఈ రాజేశ్వర్ సీన్ లోకి ఎలా వచ్చాడు అంటే… మొదట ప్రవీణ్ పేపర్ ను దొంగిలించిన తర్వాత రేణుకకు పేపర్ ఇచ్చే ముందుగా ఈ విషయం బయటపడితే చాలా ప్రమాదం.. కాబట్టి బాగా నమ్మకం ఉన్న వారికి అమ్మాలని గట్టిగా చెప్పాడట. అలా రేణుక భర్త వారికి బాగా దగ్గర బంధువు అయిన రాజేశ్వర్ కి స్ పేపర్ ను ఇచ్చాడట. ఇలా ప్రవీణ్ నుండి రాజేశ్వర్ వరకు పేపర్ లీక్ అయింది. ఇంకా ముందు ముందు ఈ విషయంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version