శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై అందుబాటులోకి ఆఫ్ లైన్ టికెట్లు

-

తిరుమల వచ్చే సామాన్య భక్తులుకు ప్రాధాన్యత ఇచ్చేలా త్వరలోనే ఆఫ్ లైన్ ద్వారా టోకేన్లు జారి ప్రకియ ప్రారంభిస్తామని టిటిడి చైర్మెన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటన చేశారు. కోవిడ్ కారణంగా విధిలేని పరిస్థితిలో ఆన్ లైన్ ద్వారా ప్రస్తూతం సర్వదర్శన టోకేన్లు జారి చేస్తూన్నామని.. కోవిడ్ వ్యాప్తి చెందుతుంది అన్న ఆందోళనతో తిరుపతిలో ఆఫ్ లైన్ ద్వారా టోకేన్లు జారి చేసే విధానాని గత ఏడాది సెప్టంబర్ 25 నుంచి రద్దు చేసామని గుర్తు చేశారు.


ఆన్ లైన్ లో సర్వదర్శన టోకేన్లు జారి చేస్తూన్నా ….గ్రామీణ ప్రాంతంలో వున్న సామాన్య భక్తులుకు దర్శన టోకేన్లు అందడం లేదన్న భావనలో టిటిడి వుందని తెలిపారు. ఎప్పటికప్పుడు తిరుపతిలో ఆఫ్ లైన్ విధానంలో సామాన్య భక్తులుకు సౌకర్యవంతంగా వుండేలా సర్వదర్శన టోకేన్లు జారి చెయ్యాలని భావిస్తూన్నామని…కోవిడ్ తీవ్రత కారణంగా వాయుదా వేస్తూ వస్తూన్నామని స్పష్టం చేశారు.

పిభ్రవరి 15వ తేదీకి ఒమిక్రాన్ తీవ్రత తగ్గుముఖం పడుతుంది అన్న నిపుణులు సూచన మేరకు ….ప్రస్తూతం ఆన్ లైన్ లో పిభ్రవరి 15 వరకు సంభందించిన సర్వదర్శనం టోకేన్లు మాత్రమే జారి చేస్తూన్నామన్నారు. పిభ్రవరి 15న పరిస్థితి అంచనా వేసి సర్వదర్శనం టోకేన్లు సామాన్య భక్తులుకు సులభతరంగా అందేలా ఆఫ్ లైన్ విధానంలో జారి చేసే అంశం పై నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా నిన్న శ్రీవారిని దర్శించుకున్న 24888 మంది భక్తులు కాగా… 12650 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే హుండి ఆదాయం 2.1 కోట్లుగా నమోద అయింది.

Read more RELATED
Recommended to you

Latest news