Breaking : పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై కేంద్రమంద్రి కీలక వ్యాఖ్యలు

-

రోజు రోజుకు పెరుగుతున్ పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చమురు ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే వినియోగదారులపై పెద్ద మొత్తంలో భారం తగ్గుతుందనే అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో తగ్గింపు విషయమై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని అన్నారు. సమయం గడుస్తున్న కొద్దీ ఈ విషయంపై స్పష్టత వస్తుందన్నారు. గత త్రైమాసికంలో ప్రభుత్వరంగ పెట్రోలియం సంస్థలు సంతృప్తికర ఆర్థిక ఫలితాలు సాధించాయన్నారు.

Petrol, diesel prices rise 14th time in 16 days - Lagatar English

కొంతమేర నష్టాలను పూడ్చుకోగలిగాయన్నారు. రాబోయే రోజుల్లో ధరలు తగ్గించడంపై ఏం చేయాలనేది ఆలోచిస్తామన్నారు. సామాన్యులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలే పెట్రోల్ ధరలపై గొంతు చించుకుంటున్నాయని, కానీ ఆ రాష్ట్రాల్లోనే ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఆయా రాష్ట్రాలు వ్యాట్ తగ్గించకపోవడం వల్లే ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news