ఉపాసన రచ్చ మామూలుగా లేదు.. ఫ్యాన్స్‌తో కలిసి థియేటర్లో పేపర్లు గాల్లోకి విసిరిన రామ్ చరణ్ భార్య..

-

ప్రజెంట్ ఎక్కడా చూసినా, ఎవరిని కదిలించినా ‘ఆర్ఆర్ఆర్’  ఫిల్మ్ గురించే చర్చించుకుంటున్నారు. చిత్ర విడుదల సందర్భంగా అందరూ ఎగ్జయిటింగ్‌గా ఫీలవుతున్నారు. నార్మల్ పీపుల్ నుంచి సెలబ్రిటీల వరకు అందరూ సపర్ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు బెన్ ఫిట్ షోలు ఆల్రెడీ చూసేశారు. హైదరాబాద్‌లోని పలు థియేటర్స్‌లో బెన్ ఫిట్ షోలు వేయగా అక్కడికి వెళ్లి సినిమా చూసేశారు.

కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్‌లో హీరో రామ్ చరణ్ వైఫ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చూసింది. ఈ క్రమంలోనే హీరోల ఇంట్రడక్షన్ సమయంలో అభిమానుల మాదిరిగా తాను కూడా కేరింతలు కొట్టింది. పేపర్లు గాల్లోకి విసిరి ఆనందపడిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ‘నాటు నాటు’ సాంగ్ సందర్భంగా ఉపాసన రామ్ చరణ్, తారక్ డ్యాన్స్ స్టెప్స్ చూసి చాలా హ్యాపీగా ఫీలైంది. ఈ సందర్భంలోనే పేపర్లు అలా గాల్లోకి విసిరింది.

మొత్తంగా ‘ఆర్ఆర్ఆర్’ మేనియా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగానూ ఉంది. విదేశాల్లోనూ తమ అభిమాన హీరోలను చూసేందుకు ఫ్యాన్స్ పోటెత్తుతున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ విజ్యువల్ వండర్ చూసేందుకు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయగా, ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందించారు. అల్లూరి సీతారామరాజు పాత్రను రామ్ చరణ్ తేజ్ పోషించగా, కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ నటించారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, హీరోయిన్ ఆలియా భట్, సీనియర్ హీరోయిన్ శ్రియ , సముద్ర ఖని కీలక పాత్రల్లో కనిపించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version