ఇంకోసారి సజ్జల ప్రెస్ మీట్ పెడితే.. హైకోర్టులో కేసు వేస్తా : వర్ల రామయ్య

-

ప్రభుత్వ సలహా దారులు సజ్జల రామకృష్ణా రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. సజ్జల మరోసారి ప్రెస్ మీట్ పెడితే హైకోర్టుకు వెళ్ళి కేసు వేస్తానని స్పష్టం చేశారు వర్ల రామయ్య. మరోసారి సజ్జల ప్రెస్ మీట్ పెడితే సజ్జలే సీఎం అని రాష్ట్రం మొత్తం తిరిగి చెబుతానని పేర్కొన్నారు.  ఓ సలహా దారుగా ఉన్న సజ్జల అన్ని విషయాలు ఆయనే ఎలా మాట్లాడతారు..? అని నిలదీశారు వర్ల రామయ్య. వైసీపీ పార్టీ లో అంతా తానై సజ్జలే నడిపిస్తున్నారని నిప్పులు చెరిగారు.

ప్రభుత్వంలో పిల్లి ఈనినా.. కుక్క అరిచినా సజ్జలే సమాధానం చెబుతారని చురకలు అంటించారు. వైఎస్ సీఎంగా ఉన్న రోజుల్లో జగన్ బెంగళూరులో ఉన్నప్పుడు ఆయనతోనే కలిసి సజ్జలే ఉండేవారని… ఒకే కంచం.. ఒకే మంచం అన్నట్టుగా సజ్జల-జగన్ ఉండేవారని ఎద్దేవా చేశారు. దొంగ లెక్కల్లో సజ్జల దిట్ట అని.. సీఎంగా తానున్నా.. ప్రభుత్వాన్ని సజ్జలే నడుపుతారని జగన్ సలహాదారు పదవిని సజ్జలకు కట్టబెట్టారని పేర్కొన్నారు. వైసీపీ పార్టీ చాలా దారుణంగా వ్యవహరిస్తోందన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version