చంద్రబాబును కలిసిన వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు

-

టీడీపీ అధినేత చంద్రబాబును నేడు పెద్దారవీడు మండలానికి చెందిన వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్వాసితులైన తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.18 లక్షల పరిహారం ఇస్తామని వైసీపీ ఇచ్చిన హామీని విస్మరించిందని వారు వివరించారు.

Govt to take up Veligonda project works on priority basis

ఈ సందర్భంగా చంద్రబాబు దీనికి స్పందిస్తూ, 2004 తర్వాత కాంగ్రెస్ హయాంలో పనులు జరగలేదని అన్నారు. 2014లో తాము అధికారంలోకి వచ్చాక పనులు వేగవంతం చేశామని ఆయన వెల్లడించారు. మిగిలిన 10 శాతం పనులు కూడా జగన్ పూర్తిచేయలేదని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజితో పాటు అన్ని విధాలా న్యాయం చేస్తామని చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు హామీ ఇచ్చారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news