VSR: సంక్రాంతికి హైలెట్ గా నిలిచిన హనీ రోజ్..!

-

ప్రముఖ మలయాళం బ్యూటీ హనీ రోజ్ మరొకసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసిన విషయం తెలిసింది . 2008 సంవత్సరంలోనే తెలుగులో హీరోయిన్ గా ఆలయం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె అందులో హీరోగా శివాజీ నటించారు. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దాంతో అప్పట్లో హనీ రోజ్ ను ఫిలిం మేకర్స్ పెద్దగా పట్టించుకోలేదని చెప్పవచ్చు. తెలుగులో ఈమెకు అవకాశాలు రాకపోయినా మలయాళంలో మాత్రం వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేసిన ఈమె తాజాగా టాలీవుడ్ లో వీర సింహారెడ్డి సినిమాలో మంచి పాత్ర దక్కించుకుంది.

బాలకృష్ణకు తల్లి పాత్రలో అలాగే భార్య పాత్రలో కనిపించి రెండు విధాలుగా కూడా ప్రేక్షకులను మెప్పించింది. టాలీవుడ్ లో వీర సింహారెడ్డి సినిమా తర్వాత హనీ రోజ్ బిజీ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటూ సినీ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి వీరసింహారెడ్డి సినిమా ఫలితంతో సంబంధం లేకుండా అటు మలయాళం బ్యూటీ హనీ రోజ్ కు ఇటు కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ కు మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. ఈ సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చేటట్టు తెలుస్తోంది.

గత ఏడాది మంచులక్ష్మి నటించిన మాన్స్టర్ సినిమాలో మంచు లక్ష్మితో లిప్ కిస్ ఇచ్చి బాగా వైరల్ గా మారిన ఈమె.. ఇప్పుడు వీర సింహారెడ్డి సినిమాలో కూడా నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ కంటే హనీ రోజ్ కు సంక్రాంతి పండుగ సందర్భంగా మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version