వరంగల్‌లో ఫర్నిచర్‌ గోదాంలో అగ్నిప్రమాదం

-

వరంగల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని ఇసుక అడ్డా కూడలిలో శుక్రవారం తెల్లవారుజామున స్థానికంగా ఉన్న పాత దర్వాజాలు, కిటికీలు విక్రయించే దుకాణాలకు చెందిన గోదాంలో మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ఉన్న ఒక ఫెర్టిలైజర్ షాపు, ఓ ద్విచక్ర వాహన రిపేర్ కేంద్రానికి మంటలు అంటుకున్నాయి. చుట్టుపక్కల ఉన్న నివాస గృహాలలోకి పొగ రావడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది సుమారు 12 ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలు అదుపు చేస్తున్నారు. ఉదయం 8 గంటల వరకు కూడా పూర్తిస్థాయిలో మంటలు ఆర్పలేకపోయారు. సుమారు రూ.కోటి విలువైన ఫర్నిచర్ దగ్ధమైనట్లు వ్యాపారులు తెలిపారు. అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వరంగల్ ఏసిపి గిరి కుమార్ కలకోట తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version