చిత్తూరు జిల్లాలో పెళ్లి బస్సు బోల్తా…8 మంది మృతి, 55 మందికి గాయాలు

-

ఏపీలోని చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మదనపల్లె – తిరుపతి జాతీయ రహదారిపై భాకరాపేట కనుమలోని భారీ మలుపువద్ద శనివారం రాత్రి ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో మహిళ, చిన్నారి సహా 8 మంది మృతి చెందారు. ఘటనా స్థలిలో ఏడుగురి మృత దేహాలను సహాయక బృందాలు వెలికితీయగా.. నారావారి పల్లి పీహెచ్‌సీలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది.

ప్రమాదంలో పెళ్లి కుమారుడితో పాటు మరో 43 మందికి గాయాలు అయ్యాయి. మృతులు మలిశెట్టి వెంగప్ప, మలిశెట్టి మురళి, కాంతమ్మ, మలిశెట్టి గణేశ్‌, జె. యశశ్విని డ్రైవర్‌ నబీ రసూల్‌, క్లీనర్‌ మృతి చెందినట్లు గుర్తించారు. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషయం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్షత గాత్రులను తిరుపతి రుయా, స్విమ్స్‌ ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version