విశాఖ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు వైఖరీ ఏంటి..? : మంత్రి బొత్స

-

విశాఖ స్టీల్ ప్లాంట్ పై టీడీపీ అధినేత నారా  చంద్రబాబు నాయుడు  వైఖరీ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు విద్యాశాఖ  మంత్రి బొత్స సత్యనారాయణ. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు గాజువాక వస్తున్న తరుణంలో బాబు వైఖరీ స్పష్టం చేయాల్సిందేనని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు తన వైఖరి ఏంటో చెప్పాలి. రేపు గాజువాక వస్తున్న చంద్రబాబుని నిలదీయాలి. ప్రజలు అడగకపోయినా టీడీపీ సమాధానం చెప్పాలి. స్టీల్ ప్లాంట్ పై తన వైఖరి చెప్పిన తర్వాతే చంద్రబాబు రేపు గాజువాకలో ఓట్లు అడగాలి. స్టీల్ ప్లాంట్ డ్రామాలాడుతున్న చంద్రబాబును ప్రజలు నిలదీయాలి.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో పోరాడతాం. టీడీపీ-జనసేన- బీజేపీకి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆమోదం తెలిపినట్లే. లాబీయింగ్ చేసే సీఎం రమేష్ కు అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నా. అనకాపల్లిలో క్యాష్ పార్టీ తప్ప టీడీపీకి బీసీ నేత దొరకలేదా?. వలంటీర్లపై చంద్రబాబుది నాలుకా,. తాటిమట్టా. వృద్ధాప్యం, ప్రజావ్యతిరేకతతో చంద్రబాబు అయోమయంలో ఉన్నట్లున్నారు అని బొత్స ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version