ఏంటీ.. రజనీకాంత్ నిజంగానే ఆ స్టార్ హీరోయిన్ ని మోసం చేశారా..?

-

సౌత్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో నటించిన ఆయన శ్రీదేవి, శ్రీ విద్యా వంటి సీనియర్ నటీమణులను మొదలుకొని శ్రీయ , నయనతార , తమన్నా , కీర్తి సురేష్ వంటి ఈతరం హీరోయిన్ల వరకు అన్ని జనరేషన్ ల హీరోయిన్లతో కలసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.


ముఖ్యంగా అప్పట్లో శ్రీదేవి, రజనీకాంత్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ కూడా ఉండేది. వీళ్ళిద్దరూ కలిసి తెలుగు, తమిళ్ , కన్నడ, హిందీ భాషల్లో మొత్తంగా 22 సినిమాలలో నటించగా.. వాటిలో గాయత్రి, పతినారు వాయితినిలే సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే తెరమీద మాత్రమే కాదు తెర వెనుక కూడా వీరి మధ్య మంచి స్నేహం ఉండేదట.అప్పట్లో ఒకసారి రజినీకాంత్ కి ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చేరితే శ్రీదేవి ఏకంగా ఐదు రోజులు అన్నం తినకుండా మానేశారట .దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని వార్తలు కూడా వచ్చాయి.

అదే సమయంలో తరచూ రజనీకాంత్ శ్రీదేవి ఇంటికి వెళ్తూ ఉండగా అప్పటికే కమలహాసన్తో బ్రేకప్ అయిన బాధలో ఉన్న ఆమెకు రజనీకాంత్ స్నేహం మరింత దగ్గర అయ్యేలా చేసింది. పెళ్లి చేసుకోవాలని అనుకుంది శ్రీదేవి. అయితే ఈ విషయాన్ని అడిగితే రజనీకాంత్ మాత్రం తనకు ఎప్పుడు అలాంటి ఉద్దేశం లేదని .. కావాల్సి వస్తే తన చెల్లిని పెళ్లి చేసుకుంటానని శ్రీదేవితో చెప్పారట. ఇక ఈ మాట వినగానే తట్టుకోలేకపోయిన శ్రీదేవి తనతో సాన్నిహిత్యంగా ఉంటూ తన చెల్లిని పెళ్లి చేసుకుంటా అనడంతో సహించలేకపోయింది. దాంతో ఇక రజనీకాంత్ ను దూరం పెట్టిందట ఈ ముద్దుగుమ్మ.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version