హైదరాబాద్‌లో ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు వైన్స్‌ బంద్‌

-

హైదరాబాద్‌లో మందుబాబులకు బ్యాడ్ న్యూస్. ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. మార్చి 11 సాయంత్రం 4 గంటల నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు 3 రోజుల పాటు నగరంలో వైన్‌ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసి ఉంచాలని ఎక్సైజ్‌ శాఖ అదేశాలు జారీ చేసింది.

ఈ నెల 13న హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఎక్సైజ్‌ శాఖ ఈ ఉత్తర్వులిచ్చింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం నామినేషన్ వేసిన 21 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రియాంక ప్రకటించారు. మార్చి 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. మార్చి 16న ఓట్ల లెక్కింపు చేయనున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version