Women’s Day special : తండ్రి రైతు.. కూతుర్లు అందరూ ఐఏఎస్ ఆఫీసర్లే..

-

ఆడపిల్లలు ఇల్లు, పిల్లలు కుటుంబం అనే ఉండాలి.. మగాడు సంపాదించాలి అనేది ఒకప్పటి మాట.. ఇప్పుడు మహిళలు అన్నీ రంగాల్లో దూసుకుపోతున్నారు. ఆడ భ్రూణహత్యలు, బాల్య వివాహాలకు అపఖ్యాతి పాలైన రాష్ట్రంలో.. ఒక రైతు ఐదుగురు కుమార్తెలు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు.. తాము అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత కావడానికి కారణం తమ తండ్రి అంటూ గర్వంగా చెబుతారు. రాజస్థాన్ కు చెందిన ఈ ఐదుగురు అక్కచెల్లెలు నేటి యువతకు స్ఫూర్తి.. ఒక ఇంట్లో ఒకరు కలెక్టర్‌ అయితే ఆ వీధిలోని వారంతా చేసే సంబరాల గురించి హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే.. మరి అలాంటిది ఒకే ఇంట్లో ఐదుగురు కలెక్టర్లు అయితే.. మరి ఆ కుటుంబం.. ఆ వీధిలో ఉండేవారు పొందే ఆనందం గురించి ఎంత చెప్పినా తక్కువే.. అలాంటి అరుదైన కుటుంబం సహదేవ్‌ సహరన్‌..

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని హనుమాన్‌ఘర్ జిల్లాలోని భేరుసరి అనే చిన్న గ్రామానికి చెందిన సహదేవ్ సహారన్ , లక్ష్మి దంపతులకు ఐదుగురు కుమార్తెలు. కొడుకు కోసం చూస్తే ఐదుగురు ఆడపిల్లలు పుట్టారు. రోమా, మంజు, అన్షు, రీతు, సుమన్‌ పేర్లు పెట్టుకున్నారు. తల్లి లక్ష్మి చదువుకోలేదు. తండ్రి సహదేవ్ రైతు..వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాడు.. అయితే గ్రామంలో నిరంతరం నీటి ఎద్దడి.. దీంతో ఎంత కష్టపడినా పొలంలో మంచి దిగుబడి వచ్చేది కాదు..

పిల్లల్ని బడికి పంపి చదివించే స్థోమత లేని తండ్రి ఇంట్లోనే చదువును చెప్పించాడు..అంతేకాదు తనకు కలెక్టర్‌ కావాలన్న కోరిక ఉండేదని.. అది నెరవేరలేదని తన కుమార్తెలకు చెప్పాడు సహదేవ్. తన కోరిక నెరవేర్చాలంటూ తన మనసులోని మాట కూతుర్ల ముందు బయటపెట్టాడు..తండ్రి కలను తాము తీర్చడమే లక్ష్యంగా చదువుకున్నారు. 2010లో రోమా తన కుటుంబంలో మొదటి RAS అధికారి అయ్యారు. అనంతరం 2017లో మంజు కూడా పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఇద్దరు అక్కలు సాధించిన విజయంతో స్ఫూర్తి పొందిన చెల్లెళ్లు అన్షు, రీతు, సుమన్ కూడా రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కు ప్రిపేర్ కావడం ప్రారంభించారు…

సివిల్స్ లో ఉత్తీర్ణత సాధించిరాజస్తాన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సర్వీస్‌ కు ఏకకాలంలో ఎంపికై అందర్ని ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రజల దృష్టిని తమవైపుకు తిప్పేలా చేశారు ఈ అక్కాచెల్లెళ్లు. పట్టుదల, కృషితో, ఐదుగురు అమ్మాయిలు ఇప్పుడు RAS ఆఫీసర్లుగా ప్రజలకు సేవ చేస్తున్నారు.తండ్రి కష్టాన్ని అర్థం చేసుకున్న తనయలు.. కలెక్టర్లుగా ఎంపికయ్యి తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చి యువతకు ఆదర్శ ప్రాయంగా నిలిచారు.కూతుర్లు అందరూ కలెక్టర్లు కావడంతో ఆ తండ్రిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version