తెలంగాణలోని వైసీపీ కేడర్‌ చూపు షర్మిల వైపేనా

-

తెలంగాణలోని వైఎస్‌ అభిమానులే లక్ష్యంగా షర్మిల అండ్‌ టీమ్‌ పావులు కదుపుతోంది. చాలా మంది నాయకులకు ఫోన్లు కూడా వెళ్లాయి. దాంతో తెలంగాణలో ఉనికిలో లేని వైసీపీలో ఉండాలా లేక షర్మిల వెంట వెళ్లాలా అని ఆలోచనలో పడ్డారట తెలంగాణ వైసీపీ కేడర్‌. ఇప్పుడు కొత్తగా మరోపార్టీ పుట్టుకొస్తున్న తరుణంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఉనికిలో ఉన్న తెలంగాణ వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారట…

తెలంగాణలో వైసీపీ కొనసాగింపుపై పార్టీ అధినేత ఏమనుకుంటున్నారో క్లారిటీ ఇచ్చేశారు ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. దీంతో ఇవాళ కాకపోయినా రేపైనా తెలంగాణలో వైసీపీ కార్యకలాపాలు మొదలవుతాయని ఆశించిన వారు డైలమాలో పడ్డారట. ఇదే సమయంలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్ధం కానుండటంతో అటు వెళ్లాలా లేదా అని ఊగిసలాటలో ఉన్నారట.

2014 ఎన్నికల్లో వైసీపీ తెలంగాణలోనూ పోటీ చేసినా.. కేవలం ఖమ్మంలోనే ఒక ఎంపీ.. ముగ్గురు ఎమ్మెల్యేలను గెలుచుకుంది. తర్వాతి రోజుల్లో వారంతా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. 2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో వైసీపీ పోటీ చేయలేదు. కానీ..ఆ పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడిగా గట్టు శ్రీకాంత్‌ రెడ్డి రెండు దఫాలుగా కొనసాగుతున్నారు. సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ ఇక్కడ పోటీ చేయలేదు. పార్టీ చేపట్టిన కార్యక్రమాలూ లేవు. ఏం చేయాలన్నా పార్టీ పెద్దల అనుమతి తప్పనిసరి. పైగా తెలంగాణ సర్కార్‌కు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు.. కార్యక్రమాలు ఉండకూడదనే ఆదేశాలు ఉన్నాయట. దీంతో అంతా సైలెంట్‌ అయిపోయారు.

తెలంగాణలోని వైఎస్‌ అభిమానులే లక్ష్యంగా షర్మిల అండ్‌ టీమ్‌ పావులు కదుపుతోంది. చాలా మంది నాయకులకు ఫోన్లు కూడా వెళ్లాయి. దాంతో తెలంగాణలో ఉనికిలో లేని వైసీపీలో ఉండాలా లేక షర్మిల వెంట వెళ్లాలా అని ఆలోచనలో పడ్డారట కేడర్‌. ఇప్పుడున్న రాజకీయ పరిణామాలలో ఎవరైనా పెద్ద నాయకులు షర్మిల శిబిరంలో చేరితే.. ఒక నిర్ణయానికి వద్దామని కొందరు వేచి చూస్తున్నారట.

వైసీపీ ప్రారంభించిన కొత్తలో తెలంగాణలో యాక్టివ్‌గా ఉన్నవారంతా తర్వాతికాలంలో ఎవరిదారి వారు చూసుకున్నారు. వైఎస్‌పైనా, జగన్‌పైనా అభిమానంతో కొందరు కార్యకర్తలు, అనుచరులు మాత్రం అలాగే ఉండిపోయారు. ఇప్పుడు వీరి దారి ఎటన్నది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news