పాపం టీడీపీ డ్రామా కంపెనీ అయిపోయిందిగా…!

-

సీఎం రైతు పక్షపాతి అని చెప్పడానికి వ్యవసాయ బడ్జెట్ నిదర్శనం అని వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమం, శాశ్వత మౌలికసదుపాయల కల్పన కు ప్రాధాన్యత ఇచ్చాం అని అన్నారు. వైఎస్సార్ ల్యాబ్స్ వచ్చే ఖరీఫ్ నాటికి ప్రారభమైయ్యేలా చర్యలు చేపడుతున్నాం అని తెలిపారు. సీఎం చెప్పినట్టు నిన్నటికన్నా ఈ రోజు బాగుండటం అభివృద్ధి అని అన్నారు.

ఒక్క రూపాయి అవినీతి లేకుండా లక్షా 25 వేల కోట్లు లబ్ధిదారులకు అందించాం అని ఆయన వెల్లడించారు. టీడీపీ డ్రామా కంపెనీ లాగా మాక్ అసెంబ్లీ నిర్వహిస్తుంది అని తెలిపారు. వాళ్లే వాకౌట్ చేసుకునే దాన్ని ఏమంటారు అని నిలదీశారు. కోవిడ్ లాంటి సమయంలో బాధ్యత లేకుండా ప్రతిపక్షం వ్యవహరిస్తోంది అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version