బ్రేకింగ్: జడ్జి ముందు రఘురామ

-

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజుని పోలీసులు జడ్జి ముందు హాజరు పరిచారు. గుంటూరులో ఆరో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్ట్ ముందు ఆయనను హాజరు పరిచారు సి ఐ డీ పోలీసులు. ఇక ఆయన బెయిల్ పిటీషన్ ని నేడు మధ్యాహ్నం హైకోర్ట్ కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇక అక్కడి నుంచి పరిణామాలు అన్నీ వేగంగా మారిపోతున్నాయి. ఈ విషయంలో కింది స్థాయి కోర్ట్ లో అప్పీల్ చేసుకోవాలని హైకోర్ట్ ఆదేశం ఇచ్చింది.

ఇక రఘురామ అంశానికి సంబంధించి మరికొంతమందిని కూడా ఎఫ్ ఐ ఆర్ లో సిఐడీ అధికారులు చేర్చారు. వారిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. రెండు ప్రముఖ చానల్స్ కి సంబంధించి కొందరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని  కథనాలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version