వైఎస్సార్ బతికి ఉంటే నిజాం షుగర్స్ ప్రభుత్వపరం అయ్యేది : షర్మిల

-

తెలంగాణ వ్యాప్తంగా వైఎస్సాఆర్‌టీ అధినేత్రి వైఎస్‌ షర్మిలా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో.. కోరుట్ల టౌన్ లో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ.. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తామని చెప్పిన హామీ ఏమయ్యిందని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బంగారు తెలంగాణలో ఫ్యాక్టరీ మూతపడుతుంటే చూస్తూ ఊరుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల. వైఎస్సార్ బతికి ఉంటే నిజాం షుగర్స్ ప్రభుత్వపరం అయ్యేదని షర్మిల చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రజలకు చేసిందేమీ లేదని షుగర్ ఫ్యాక్టరీ తెప్పించకపోతే ఉరివేసుకుంటానన్న స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు ఏమయ్యారని షర్మిల ప్రశ్నించారు. పదవిని అనుభవిస్తున్న వారు ప్రజలను ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు షర్మిల.

YS Sharmila: భద్రాచలంలో షర్మిల బహిరంగ సభ

కేసీఆర్ పాలనలో పేదవాడికి గౌరవం లేకుండా పోయిందని షర్మిల వ్యాఖ్యానించారు. వైఎస్సార్ నగరబాట ద్వారా కోరుట్లకు వచ్చారని.. ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా ఉండాలని ఫిల్టర్ బెడ్ కట్టించారని చెప్పారు. ఫిల్టర్ బెడ్ ను ప్రారంభిస్తే వైఎస్సార్ కి పేరు వస్తుందని దానిని ప్రారంభించకుండా వదిలేశారని షర్మిల విమర్శించారు. వైఎస్సార్ హయాంలో పసుపు పచ్చ బంగారం అయ్యిందని చెప్పారు షర్మిల. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపైనా ఆమె స్పందించారు. మునుగోడులో ఓటు కోసం.. సింపతీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు షర్మిల. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనడం ఏంటి అని వ్యంగ్యంగా మాట్లాడారు. ఎమ్మెల్యే ల కొనుగోలు పై విచారణ జరిపిస్తే అసలు విషయం బయట పడుతుందని స్పష్టం చేశారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news