హుజూరాబాద్ టీఆర్ఎస్ ఓటమిపై షర్మిళ ఆసక్తికర ట్విట్.

-

హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ విజయం సాధించింది. అధికార టీఆర్ఎస్ పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధికారం, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు ఎంతగా వాడుకున్నా టీఆర్ఎస్ గెలుపొందలేకపోయింది. ప్రస్తుత విజయంపై పలువురు నేతలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అన్ని పార్టీలు బీజేపీ విజయం, టీఆర్ఎస్ ఓటమిపై స్పందిస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు కూడా దీనిపై ఆసక్తికర ట్విట్ చేశారు.

’హుజూరాబాద్ లో కేసీఆర్ కు ప్రజలు బాగా బుద్ది చెప్పారు. వేల కోట్లు ఖర్చు పెట్టినా చెంపచెల్లుమనేలా తీర్పు ఇచ్చారు. తెలంగాణ ప్రజలు బానిసలు కాదు, ఉద్యమకారులని నిరూపించారు. కేసీఆర్ గారడీ మాటలు, పిట్ట కథలను జనం నమ్మరు. ఇకనైనా బుద్ది వచ్చిందా కేసీఆర్..?‘ అంటూ ట్విట్టర్ లో టీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news