ఇకపై ఒప్పో, వన్‌ప్లస్‌ ఫోన్లు జర్మనీలో బ్యాన్.. తీర్పిచ్చిన ధర్మాసనం..!

-

జర్మనీ కోర్టు ఒప్పో, వన్‌ప్లస్‌ ఫోన్లకు భారీ షాక్‌ ఇచ్చింది. ఈ రెండు ఫోన్లను ఆ దేశంలో బ్యాన్‌ చేస్తూ తీర్పు ఇచ్చింది. ఇకపై ఒప్పో, వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లు జర్మనీలో అందుబాటులో ఉండవు. ఇటీవల ఒప్పో, వన్‌ప్లస్‌ కంపెనీలు నోకియా పేటెంటెడ్ టెక్నాలజీ (Nokia Patented Technology)కి సంబంధించి ఒక వివాదంలో చిక్కుకున్నాయి. ఈ పేటెంటెడ్ టెక్నాలజీ విషయంలోనే జర్మనీలోని మ్యాన్‌హీమ్ రీజినల్ కోర్టు ఒప్పో, వన్‌ప్లస్‌ ఫోన్స్ బ్యాన్ చేసిపడేసింది. ఈ వివాదంలో కోర్టు నోకియాకు అనుకూలంగా తీర్పునిచ్చింది.అసలు కథేంటంటే..

ఇటీవల నోకియా పేటెంట్ పొందిన టెక్నాలజీని నోకియా లైసెన్సులు లేకుండానే ఒప్పో తన డివైజ్‌ల్లో వాడేసిది..ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోకుండా ఒప్పో తన పేటెంటెడ్ టెక్నాలజీని అలా ఎలా ఉపయోగిస్తుందని నోకియా కంపెనీకి చిర్రెత్తింది. ఆ తర్వాత 2021లో యూకే, ఫ్రాన్స్, జర్మనీతో సహా ఆసియాలోని ఇండియా, యూరప్‌లోని నాలుగు దేశాలలో ఒప్పోపై దావా (Lawsuit) వేసింది. అయితే ప్రస్తుతం ఈ కంపెనీల మొబైల్స్‌పై కోర్టు విధించిన బ్యాన్ పర్మనెంట్ బ్యాన్ కాదు. కాకపోతే నోకియా యూరోపియన్ పేటెంట్ EP 17 04 731 ఉల్లంఘించినందుకు ఒప్పో, వన్‌ప్లస్ ఇకపై జర్మనీలో తమ డివైజ్‌లను విక్రయించలేవు. ఈ పేటెంట్ వివాదంలో ఒప్పోపై నోకియా ఇప్పుడు మొదటి విజయాన్ని సాధించింది.

మ్యాన్‌హీమ్‌లోని జర్మన్ కోర్టు నోకియా 4G/5G పేటెంట్ వివాదంలో ఒప్పో, దాని అనుబంధ సంస్థ వన్‌ప్లస్‌కి వ్యతిరేకంగా నోకియా కంపెనీకి సపోర్ట్‌గా తీర్పు ఇచ్చింది. కొన్ని నెలల క్రితం నోకియా, ఒప్పో బ్రాండ్‌ల మధ్య 4G (LTE), 5G కనెక్టివిటీ పేటెంట్‌ విషయంలో వివదాలు తలెత్తాయి. ఇదే విషయమై రెండు కంపెనీల మధ్య సుదీర్ఘమైన వాదోపవాదాలు జరిగాయి. నోకియా ఒప్పోపై 9 స్టాండర్డ్ ఎసెన్షియల్ పేటెంట్లు (SEPS), ఐదు ఇంప్లిమెంటేషన్ పేటెంట్లపై మూడు రీజినల్ జర్మన్ కోర్టులలో దావా వేసింది. వాస్తవానికి నోకియా దాదాపు 129 బిలియన్ యూరోల భారీ పెట్టుబడితో 5G SEPS (Standard Essential Patents) విభాగంలో నాయకత్వం వహిస్తోంది. అంతేకాదు, ఈ రంగంలో అనేక పేటెంట్‌లను నోకియా సొంతం చేసుకుంది. ఇవన్నీ గత కొన్ని ఏళ్లలోనే అనేక సెటిల్‌మెంట్లను సైతం చేసుకున్నాయి.

అయితే ఈ వివాదాస్పద పేటెంట్‌లకు సంబంధించి జర్మన్ రీజినల్ కోర్టు ఇచ్చిన తీర్పే మొదటి తీర్పు. ఈ న్యాయస్థానం ఒప్పోకి వ్యతిరేకంగా పేటెంట్‌ టెక్నాలజీని వాడుకోకుండా విరమణ (Cease-and-desist) ఆర్డర్‌ను నోకియాకు మంజూరు చేసింది. దాంతో ఒప్పో, వన్‌ప్లస్ ఇకపై తమ ఫోన్స్ విక్రయించడానికి వీలు లేకుండా అయింది.

Read more RELATED
Recommended to you

Latest news