Shruti haasan: నటి శ్రుతిహాసన్ కు కరోనా పాజిటివ్…

-

కరోనా ఎన్నో జీవితాలను అతలాకుతలం చేసింది. చాలా కుటుంబాలకు కన్నీరును మిగిల్చింది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రెటీల దాకా అందరిని అనారోగ్యాన్నికి గురిచేసింది. ఇటీలవ ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ కరోనాతో మరణించిన సంగతి తెలిసిందే. ఇండియాలో థర్డ్ వేవ్ ప్రారంభం అయిన తరువాత చాలా మంది సెలబ్రెటీలతో పాటు రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. చిరంజీవి, మహేష్ బాబు, విక్రమ్, మంచులక్ష్మీ, మంచు మనోజ్, వడివేలు ఇలా ప్రముఖులు కరోనా బారి పడ్దారు.   

తాజాగా ప్రముఖ నటి శ్రుతి హాసన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తాను అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా సోకిందని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తానని పోస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సరసన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న ‘ సలార్’ సినిమాతో పాటు.. గోపీచంద్ మలినేని దర్శకత్వలో వస్తున్న బాలక్రిష్ణ లేటెస్ట్ మూవీలో కూడా శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news