Breaking : ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు కరోనా

-

కరోనా రక్కసి ఎవరినీ వదలడం లేదు. ఇటీవల కరోనా బారినపడిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన భార్య, నటి సుహాసిని త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. మణి రత్నం ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఈ నెల 8న నిర్వహించిన ఈ సినిమా టీజర్ లాంచింగ్‌కు మణిరత్నం ఇటీవల హాజరయ్యారు. ఇదే సినిమా పోస్టుప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్న ఆయనకు ఇటీవల కొవిడ్ సోకింది.

Mani Ratnam - Wikipedia

ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు సంబంధించిన వివరాలను వైద్యులు కూడా వెల్లడించలేదు. దీంతో.. ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్‌ సెల్వన్‌ సినిమా పాన్‌ ఇండియా లెవెల్లో చిత్రికరణ జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్‌, త్రిష, కార్తీ, చియాన్‌ విక్రమ్‌లతో పాటు ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news