Breaking : ప్రముఖ పాటల రచయిత నాసిర్ ఫరాజ్ కన్నుమూత

-

బాలీవుడ్ ప్రముఖ సినీ పాటల రచయిత నాసిర్ ఫరాజ్ కన్నుమూశాడు. కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఏడేళ్ల కిందట సర్జరీ అయింది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ఛాతినొప్పి రాగా ఆసుపత్రికి వెళ్లకుండా అలాగే ఉన్నాడని, దీంతో నొప్పి తీవ్రమై మృతి చెందినట్లు సింగర్ ముజాబా అజీజ్ తెలిపాడు. హిందీ సినిమాలు కైట్స్, క్రిష్, బాజీరావ్ మస్తానీ, కాబిల్ వంటి సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ రాశాడు ఫరాజ్.

నాసిర్ ఫరాజ్ 2010లో విడుదలైన ‘కైట్స్’ చిత్రానికి ‘దిల్ క్యూన్ మేరా షోర్ కరే’ మరియు ‘జిందగీ దో పాల్ కీ’ పాటలు రాయడమే కాకుండా ఈ రెండు ప్రసిద్ధ పాటలకు గాత్రదానం చేశాడు. ఆయన మృతితో బాలీవుడ్, సంగీత ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా నసీర్ ఫరాజ్‌కు నివాళులర్పించారు. ప్రస్తుతం నసీర్ ఫరాజ్ మృతి పట్ల బాలీవుడ్‌లో విషాద వాతావరణం నెలకొంది.

 

Read more RELATED
Recommended to you

Latest news