నోరులేస్తే చేతులతో సమాధానం చెప్తాం: రోజా

-

గన్నవరంలో టీడీపీ నేతలే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్నారు మంత్రి రోజా. పనికిరాని వ్యక్తులతో సీఎం జగన్ను తిట్టిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలకు నోరులేస్తే చేతులతో సమాధానం చెప్తామని హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు దౌర్జన్యం, గూండాయిజానికి కేరాఫ్ అంటూ విమర్శించారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబును హైదరాబాద్ నుంచి తరిమికొడతారని జోస్యం చెప్పారు. వైసీపీ గుండాలు అంటూ టీడీపీ నేతలు మాట్లాడటాన్ని తప్పుబట్టారు. దౌర్జన్యం, గూండాయిజం అనేది టీడీపీ హయాంలో జరిగిందని విమర్శించారు. దౌర్జన్యం, గూండాయిజం, సైకోయిజానికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు, టీడీపీ నేతలే అని ఏపీ మంత్రి రోజా ఆరోపించారు.

చంద్రబాబును, టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయని.. వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు తన వద్ద ఉన్న సైకోలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో టీడీపీకి అడ్రస్ లేకుండా చేస్తే.. చంద్రబాబు ఆంధ్రలో నుంచి పారిపోయి హైదరాబాద్‌లో ఉన్నారని విమర్వించారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబును హైదరాబాద్ నుంచి తరిమి కొడతారని అన్నారు. సీఎం జగన్ మంచి పని చేసినప్పుడల్లా ఆయనకు క్రెడిట్ రాకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడు డైవర్షన్‌ పాలిటిక్స్ ఎలా చేస్తారనే విషయం ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news