జాన్వీ కపూర్‌కు అంతటి కష్టమొచ్చిందా.. ఇంటినే అమ్మేసిన హీరోయిన్..!

-

దివంగత స్టార్ హీరోయిన్ ..అతి లోక సుందరి శ్రీదేవికి తెలుగు నాట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, నాగార్జున, చిరంజీవిల సరసన హీరోయిన్ గా నటించిన ఈ భామ..తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పొచ్చు. ఆమె కూతురు జాన్వికపూర్ శ్రీదేవి నటవారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

 

హిందీలో ఈ సుందరి చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే జాన్వికపూర్ స్టార్ స్టేటస్ పొందింది. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును జాన్వికపూర్ ఇండస్ట్రీలో పొందింది. ఇక తన సొంత డబ్బుతో గతంలో కొన్న ఇంటిని తాజాగా జాన్వికపూర్ అమ్మేసినట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలుసుకుని జాన్వీకపూర్ కు అంతటి కష్టమేమొచ్చిందని నెటిజన్లు అనుకుంటున్నారు. 2020 డిసెంబర్ లో సుమారు రూ.40 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఓ ఇంటిని జాన్వికపూర్ తాజాగా అమ్మేసిందట. ముంబైలోని జుహు ఏరియాలోని ఆ ఇంటిని జాన్వికపూర్.. అమ్మేసిందట. మరో బాలీవుడ్ సెలబ్రిటీ స్టార్ హీరో రాజ్ కుమార్ రావు.. ఈ ఇంటిని జాన్వికపూర్ నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం. రూ.44 కోట్లకు ఈ ఇంటిని రాజ్ కుమార్ రావు కొన్నారట.

తన ఫ్లాట్ కు భారీ డీల్ వచ్చిన నేపథ్యంలోనే జాన్వికపూర్ ఆ ఇంటిని అమ్మేసిందని బీ టౌన్ సర్కిల్స్ టాక్. ఈ ఇంటిని బాలీవుడ్ ప్రొడ్యూసర్, బిల్డర్.. ఆనంద్ పండిట్ నిర్మించారని తెలుస్తోంది. రాజ్ కుమార్ రావు ..తెలుగు సూపర్ హిట్ ఫిల్మ్ ‘హిట్’ ను హిందీలో రీమేక్ చేశారు. ఒరిజినల్ డైరెక్టర్ డాక్టర్ శైలేశ్ కొలనుయే హిందీ పిక్చర్ కు దర్శకత్వం వహించడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news