లూసీఫర్ లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ ..అసలు సీక్రెట్స్ ఇవే ..?

-

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లాక్ డౌన్ నేపథ్యంలో ఆగిపోయింది. అయితే జూన్ లేదా జూలై నుండి మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టి 2021 సంక్రాంతి కి రిలీజ్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిసున్న ఈ సినిమాలో రాం చరణ్ ఇక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్నాడు.

 

అయితే ఈ సినిమా తర్వాత చిరంజీవి మళయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ రీమేక్ లో నటిస్తారు. సాహో చిత్ర దర్శకుడు సుజీత్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం రీమేక్ స్క్రిప్ట్ ని పకడ్బంధీగా సిద్దం చేసే పనిలో ఉన్నాడు. అన్ని కుదిరితే లూసీఫర్ విజయదశమికి ప్రారంభోత్సవం జరుపుకునే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన అధికారక ప్రకటన..మిగతా విషయాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకు కారణం సల్మాన్ ఖాన్ చిరంజీవి, రాం చరణ్ లకి అత్యంత సన్నిహితుడు కావడమే. అయితే లూసీఫర్ లో మాత్రం సల్మాన్ నటిస్తున్నాడన్న వార్తలు కంప్లీట్ గా ఫేక్ అని తాజా సమాచారం. ఇప్పటివరకు ఈ సినిమాలో నటీ నటుల గురించి దర్శక, నిర్మాతలు ఆలోచించనేలేదట. మరి ఈ న్యూస్ ఎలా స్ప్రెడ్ అయిందని చిత్ర యూనిట్ మాట్లాడుకుంటున్నారట. ఇక సల్మాన్ ఖాన్ ఇప్పటికే హిందీలో రెండు భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అవి రెండు కంప్లీట్ చేయడమే సల్మాన్ టార్గెట్ గా పెట్టుకున్నాడట.

Read more RELATED
Recommended to you

Latest news