Lokesh Kanagaraj: ఆ విషయం జీవితాంతం గుర్తుంటుందంటూ లోకేశ్ భావోద్వేగం..‘విక్రమ్’ డైరెక్టర్ ట్వీట్

-

యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ ప్రజెంట్ ‘విక్రమ్’ ఫిల్మ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. లోక నాయకుడు కమల్ హాసన్ తో లోకేశ్ తీసిన సినిమాకు ప్రపంచవ్యాప్తంగా చక్కటి ఆదరణ లభిస్తోంది. అతి తక్కువ సమయంలోనే రూ.వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ పిక్చర్..ప్రస్తుతం రికార్డుల వేటలో తలమునకలైంది.

విశ్వనటుడు కమల్ హాసన్ ను వెండితెరపైన ఎలాగైతే చూడాలనుకుంటున్నారో అలాగే చూపించావంటూ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ పై సినీ ప్రముఖులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా విజయాన్ని కమల్ హాసన్ సైతం ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఇంత చక్కటి చిత్రాన్ని ఇచ్చిన లోకేశ్ కు థాంక్స్ చెప్తూ తన స్వదస్తూరితో తమిళ్ లో రాసిన లేఖను పంపారు.

ఆ లెటర్ ను ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన లోకేశ్ కనకరాజ్ ఎమోషనల్ అయ్యారు. ఈ లేఖ తనకు కమల్ హాసన్ నుంచి వచ్చినట్లు పేర్కొన్న లోకేశ్..తన ‘లైఫ్ టైమ్ సెటిల్ మెంట్ లెటర్’ ఇది అని తెలిపారు. కమల్ హాసన్ రాసిన మాటలు చదువుతుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. ఈ క్రమంలోనే ‘ఖైదీ-2’ ఫిల్మ్ తీయాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. లోకేశ్ కనకరాజ్ తన నెక్స్ట్ ఫిల్మ్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తలపతి విజయ్ తో తీస్తారని వార్తలొస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news