అవును మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఆయనతోనే ఫిక్స్ అట…..!!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొద్దిరోజుల క్రితం సంక్రాంతి పండుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఆ సినిమా మంచి హిట్ అందుకుని, కెరీర్ పరంగా సూపర్ స్టార్ కు హ్యాట్రిక్ విజయాలు అందించింది. అయితే మహేష్ బాబు దాని తరువాత ఎవరి సినిమాలో నటిస్తారు అనే దానిపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే సరిలేరు ప్రమోషన్స్ సమయంలో తదుపరి సినిమాని వంశీ పైడిపల్లితో చేస్తున్నట్లు చెప్పిన మహేష్, ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ పూర్తి కాకపోవడంతో దానిని ప్రక్కన పెట్టినట్లు చెప్తున్నారు.

ఇక ఈలోగా మధ్యలో మెగాస్టార్, కొరటాల సినిమాలో మహేష్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు, అలానే గీత గోవిందం దర్శకుడు పరశురాం ఆయన కు ఇటీవల ఒక కథ చెప్పి ఒప్పించినట్లు పలు వార్తలు ప్రచారం అవుతున్నాయి. రెండు రోజులుగా ఈ వార్తలు అటు టాలీవుడ్ తో పాటు ఇటు సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా విస్తృతంగా ప్రచారం అవుతుండడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్, అసలు మహేష్ బాబు తదుపరి ఎవరి సినిమాలో నటిస్తున్నారో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. అయితే నేడు కొందరు మహేష్ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి,

 

తదుపరి ముందుగా మహేష్ బాబు చిరు, కొరటాల సినిమాలో ఒక పాత్రలో నటిస్తారని, ఆ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఆయన క్యారెక్టర్ అరగంట వరకు ఉంటుందని, అంతేకాక ఈ సినిమాలో ఆయన ఒక స్టూడెంట్ యూనియన్ నాయకుడిగా నటిస్తునట్లు చెప్తున్నారు. ఇక దాని తరువాత పరశురామ్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సినిమా, అలానే ఆపై వంశీ పైడిపల్లి సినిమాలో నటిస్తారని, మరొక రెండు రోజుల్లో వీటికి సంబంధించి అధికారిక ప్రకటనలు వెలువడనున్నట్లు టాక్…..!!

Read more RELATED
Recommended to you

Latest news