‘‘పార్థు’’గా మహేశ్ బాబు..SSMB28 టైటిల్‌పై ఆసక్తికర చర్చ

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఇప్పటికే రెండు సినిమాలు చేశారు. ‘‘అతడు’’, ‘‘ఖలేజా’’ ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి. ప్రస్తుతం వీరి కాంబోలో హ్యాట్రిక్ ఫిల్మ్ రాబోతున్నది. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ పిక్చర్ కు అసలు టైటిల్ ఏంటనే విషయమై ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ నడుస్తున్నది.

‘‘అతడు’’ సినిమాలో మహేశ్ బాబు ‘‘పార్థు’’ అనే పాత్ర పోషించాడు. కాగా, అదే పేరును ఈ ప్రాజెక్టుకు టైటిల్ ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్. అయితే, కొద్ది రోజుల కిందట ఈ సినిమాకు ‘‘అర్జునుడు’’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలొచ్చాయి.

ఇంతకీ టైటిల్ ఏంటనే విషయం తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా SSMB28కి సంబంధించిన అప్ డేట్ వస్తుందని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news