కథానాయికగా ఆ చిత్రంలో శ్రీదేవిని వద్దన్న ఎన్టీఆర్.. తర్వాత..!

-

సూపర్ హిట్ పెయిర్ గా ఎన్టీఆర్-శ్రీదేవికి చక్కటి పేరుంది. వెండితెరపైన వీరిరువురు జంటగా కనబడితే సినీ అభిమానులు ఆనందపడతారు. వీరి కాంబోలో వచ్చిన చిత్రాలు కూడా ఘన విజయం సాధించాయి. కాగా, ఒక చిత్రంలో మాత్రం శ్రీదేవిని కథానాయికగా అస్సలు వద్దని సీనియర్ ఎన్టీఆర్ చెప్పారట. అందుకు గల కారణమేంటి? అసలు అది ఏ సినిమానో ఇప్పుడు తెలుసుకుందాం.

సీనియర్ ఎన్టీఆర్..వెండితెరపైన పోషించని పాత్ర లేదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అన్ని రకాల పాత్రలను పోషించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందారు సీనియర్ ఎన్టీఆర్. ఆయన నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఆరాధన’లో పాటల గురించి అందరికీ తెలుసు. ఇందులో పాటలను మహమ్మద్ రఫీ ఆలపించగా, పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.

ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ యాక్టింగ్ చూసి జనాలు ఫిదా అయిపోయారు. అయితే, ఇందులో కథానాయికగా తొలుత జయప్రదను అనుకున్నారు. కానీ, ఆమె డేట్స్ అడ్జస్ట్ కాలేదట. అలా ఆ తర్వాత శ్రీదేవిని మేకర్స్ సంప్రదించాలనుకున్నారు. ఫైనల్ కూడా దాదాపుగా చేసేశారు. కానీ, ఎన్టీఆర్ మాత్రం ఈ చిత్రంలో కథానాయికగా శ్రీదేవి వద్దని చెప్పేశారట.

సినిమా స్టోరి పరంగా, క్యారెక్టర్ పరంగా వాణి శ్రీయే ఈ చిత్రంలో చక్కగా ఉంటారని ఎన్టీఆర్ చెప్పారట. వాణి శ్రీయే ఈ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ చేయాలని అన్నారట. అలా ఈ చిత్రంలో కథానాయకిగా వాణి శ్రీ నటించారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ -వాణి శ్రీలను జంటగా చూసి జనాలు హ్యాపీగా ఫీలయ్యారు. ఇక ఇందులోని పాటలు అన్నీ కూడా జనాలకు బాగా నచ్చాయి. ‘నా మది నిన్ను పిలిచింది గానమై’ అన్న పాట ప్రతీ ఒక్కరి ఫేవరెట్ సాంగ్ అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news