బాలీవుడ్ ఫిల్మ్‌లో ప్రభాస్ గెస్ట్ అప్పియరెన్స్..అందులో హీరో ఎవరంటే?

-

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయిన సంగతి అందరికీ విదితమే. ప్రజెంట్ తన ఫిల్మ్స్ పైన ప్రభాస్ ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆయన నటించిన గత చిత్రం ‘రాధేశ్యామ్’ అనుకున్న స్థాయిలో ఆడలేదు. కాగా, ప్రభాస్ గతంలోనే బాలీవుడ్ ఫిల్మ్ ఒకదానిలో స్పెషల్ గా గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఆ చిత్రమేంటి? దర్శకుడు ఎవరు? అందులో హీరో ఎవరు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రజెంట్ క్రేజీ ఫిల్మ్స్ చేస్తున్నారు. ఆ పిక్చర్స్ కోసం ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సంగతులు అలా పక్కనబెడితే.. ప్రభాస్ బాలీవుడ్ ఫిల్మ్ ‘యాక్షన్ జాక్సన్’లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ‘పంజాబ్ బస్త్’ అనే సాంగ్ లో సూపర్ స్టైలిష్ గా కనిపించారు ప్రభాస్.

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. హీరోయిన్స్ గా సోనాక్షి సిన్హా, యామి గౌతమ్, మనస్వి నటించారు. 2014లో విడుదలైన ఈ చిత్రానికి ఇండియన్ మైఖేల్ జాక్సన్, కొరియోగ్రాఫర్ అయిన ప్రభుదేవా దర్శకత్వం వహించారు.

ప్రభుదేవా దర్శకత్వంలో గతంలో ప్రభాస్ ‘పౌర్ణమి’ అనే చిత్రం చేశారు. ఈ క్రమంలోనే ప్రభాస్ ..ప్రభుదేవా కోసం ఆయన కొరియోగ్రఫీలో ‘పంజాబ్ మస్త్’ అనే సాంగ్ కోసం గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ప్రభాస్ ప్రజెంట్ ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘ప్రాజెక్ట్-కె’ ఫిల్మ్స్ చేస్తున్నారు. ఈ చిత్రాల తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ పిక్చర్ చేయనున్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.

Read more RELATED
Recommended to you

Latest news