వైజాగ్‌లో రాజమౌళి, రణ్‌బీర్ కపూర్..‘బ్రహ్మాస్త్ర’ ప్రమోషన్స్ స్టార్ట్

-

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన విజ్యువల్ గ్రాండియర్ ‘బ్రహ్మ్రాస్త: పార్ట్ వన్: శివ’ సినిమా ప్రమోషన్స్ ను మేకర్స్ అప్పుడే స్టార్ట్ చేశారు మేకర్స్. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మంగళవారం ఏపీలోని విశాఖపట్నం..వైజాగ్‌కు వెళ్లిన మూవీ యూనిట్ సభ్యులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, RRR ఫిల్మ్ డైరెక్టర్..రాజమౌళి, ‘బ్రహ్మాస్త్ర’ దర్శకుడు అయాన్ ముఖర్జీ వైజాగ్ కు వచ్చారు. పాన్ ఇండియా ఫిల్మ్ గా వస్తున్న ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో రాజమౌళి ప్రజెంట్ చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 9న సినిమా విడుదల కానుంది. సినిమాకు విడుదలకు ఇంకా చాలా కాలం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.

రాజమౌళి, అయాన్ ముఖర్జీ, రణ్ బీర్ కపూర్ లకు అభిమానులు భారీ గజమాలతో స్వాగతం పలికారు. ఈ చిత్రంలో భారీ తారగణమే ఉంది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషించారు. జూన్ 15న చిత్ర ట్రైలర్ విడుదల కానున్నట్లు దర్శకుడు అయాన్ ముఖర్జీ, రణ్ బీర్ కపూర్, రాజమౌళి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news