తొలి చిత్రంలో కొరియోగ్రాఫర్‌ను చూసి కన్నీటి పర్యంతమైన టబు.. ఎందుకో తెలుసా?

-

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ భామ సూపర్ సక్సెస్ ను తెలుగు సినిమా ద్వారానే అందుకుంది. తెలుగులో కథానాయికగా ఈ హీరోయిన్ ను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పరిచయం చేశారు. కాగా, ఈ చిత్రంలో కొరియోగ్రాఫర్ ను చూసి టబు కన్నీటి పర్యంతమైంది. ఈ విషయం స్వయంగా ఓ ఇంటర్వ్యూలో టబు తెలిపారు. ఎందుకు ఆమె ఏడ్చిందో ఇక్కడ తెలుసుకుందాం.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘కూలి నెం.1’ మూవీ ద్వారా హీరోయిన్ గా టబు పరిచయం అయింది. ఇందులో టబు యాక్టింగ్ చూసి జనాలు ఫిదా అయిపోయారు. ఇక పాటల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈ సాంగ్స్ లో టబును చాలా అందంగా చూపించారు దర్శకుడు. కాగా, ఈ సాంగ్స్ కొరియోగ్రఫీ చేసేందుకు వచ్చిన ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవాను చూసి టబు కన్నీటి పర్యంతమైంది.

ఆయన చేసే స్టెప్స్ తాను చేయలేమోనని టబు భావోద్వేగానికి గురైంది. అయితే, ఆ తర్వాత కష్టపడి స్టెప్స్ నేర్చుకున్నానని టబు పేర్కొన్నారు. ప్రభుదేవా ఈ సినిమాలో సాంగ్స్ కు కొరియోగ్రఫీ చేశారు. ఇక ఆ తర్వాత ప్రభాస్ దర్శకుడిగానూ పరిచయం అయ్యారు. టబు కొంత కాలం పాటు తెలుగు సినిమాలు చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ కు షిఫ్ట్ అయింది.

టబు బాలీవుడ్ లో సూపర్ హిట్ ఫిల్మ్స్ చేస్తోంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో పాటు సీనియర్ హీరోలందరి సరసన టబు నటించింది. నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ టబు ఏర్పరుచుకున్నారు. ఇటీవల వస్తున్న వార్తల ప్రకారం…‘అల వైకుంఠపురములో’ చిత్రం తర్వాత అటువంటి కీలక పాత్రలను తెలుగులో పోషించేందుకు టబు సిద్ధమైందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news