నేటి నుంచే నాగార్జునకొండకు లాంచీలు

-

నాగార్జునసాగర్‌ జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండకు లాంచీలు సోమవారం నుంచి నడపనున్నట్లు పర్యాటకశాఖ అధికారులు తెలిపారు. నాగార్జునకొండ ఏపీ ప్రాంతంలో ఉండటంతో ఆ ప్రాంతం నుంచి లాంచీలు నడపటం లేదు. దీంతో కొండపై ఆర్కియాలజీ విభాగంలో పనిచేసే సిబ్బంది వెళ్లకపోవడంతో కొండపై మ్యూజియం, ఇతర విభాగాలను మూసివేశారు. నేటి నుంచి ఆర్కియాలజీ విభాగంలో పనిచేసే ఉద్యోగులు హిల్ కాలనీ స్టేషన్ నుంచి కొండకు వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version