Budget 2024 : ఈసారి వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని 25 లక్షల కోట్లకు పెంచే అవకాశం ఉందా..!

-

మరికొద్ది రోజుల్లో కేంద్ర బడ్జెట్‌ రానుంది. ఈ మధ్యంతర బడ్జెట్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఏ ఏ రంగంపై ఎంత ఊరట ఉంటుందా అని యావత్‌ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఏ రాష్ట్రానికి ఎంత బడ్జెట్‌ కేటాయిస్తారో మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఈసారి అయినా వ్వయసాయ రంగానికి బడ్జెట్‌లో అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తారా లేదా అని రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఒక వార్త బయటకు వచ్చింది. రాబోయే మధ్యంతర బడ్జెట్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.22-25 లక్షల కోట్లకు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందట.

అర్హులైన ప్రతి రైతుకు సంస్థాగత రుణం అందుబాటులో ఉండేలా కూడా ఇది నిర్ధారిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యవసాయ రుణ లక్ష్యం రూ.20 లక్షల కోట్లు. ప్రస్తుతం, ప్రభుత్వం అన్ని ఆర్థిక సంస్థలకు మూడు లక్షల రూపాయల వరకు స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై రెండు శాతం వడ్డీ రాయితీని అందిస్తుంది. అంటే రైతులు ఏటా ఏడు శాతం రాయితీపై రూ.3 లక్షల వరకు వ్యవసాయ రుణాలు పొందుతున్నారు.

సకాలంలో చెల్లించే రైతులకు ఏడాదికి మూడు శాతం అదనపు వడ్డీ రాయితీ కూడా అందజేస్తున్నారు. రైతులు దీర్ఘకాలిక రుణాలు కూడా తీసుకోవచ్చు కానీ వడ్డీ రేటు మార్కెట్ రేటు ప్రకారం మాత్రమే ఉంటుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణ లక్ష్యం రూ.22-25 లక్షల కోట్లకు పెరగవచ్చని సంబంధిత వర్గాలు అంటున్నాయి.

అగ్రి-క్రెడిట్‌పై ఎక్కువ శ్రద్ధ చూపుతోంది. మిగిలిపోయిన అర్హులైన రైతులను గుర్తించి వారిని క్రెడిట్ నెట్‌వర్క్‌లోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రచారాలను నిర్వహిస్తోంది. కేంద్రీకృత విధానంలో భాగంగా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ‘క్రెడిట్’ పై ప్రత్యేక విభాగాన్ని కూడా రూపొందించే అవకాశం ఉంది. దీనితో పాటు.. వివిధ వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల కోసం రుణ పంపిణీ గత 10 ఏళ్లలో లక్ష్యం కంటే ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 2023 నాటికి రూ.20 లక్షల కోట్ల వ్యవసాయ రుణ లక్ష్యంలో 82 శాతం సాధించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ కాలంలో ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సుమారు రూ. 16.37 లక్షల కోట్ల రుణాలు పంపిణీ అయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా వ్యవసాయ రుణాల పంపిణీ లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యవసాయ రుణాల పంపిణీ రూ.21.55 లక్షల కోట్లు. ఇది ఈ కాలానికి నిర్దేశించిన రూ.18.50 లక్షల కోట్ల లక్ష్యం కంటే ఎక్కువ. కిసాన్ క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్ ద్వారా 7.34 కోట్ల మంది రైతులు రుణాలు పొందారు. మార్చి 31, 2023 వరకు దాదాపు రూ.8.85 లక్షల కోట్లు బకాయిలు ఉన్నాయి. చూడాలి ఇవి అంచనాలుగానే మిగిలిపోతాయా లేక అమలువుతాయా అనేది.

Read more RELATED
Recommended to you

Exit mobile version